సారాంశం
ఏపీ సీఎం చంద్రబాబు శనివారం డిల్లీలో పర్యటించనున్నారు. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ వేదిక ‘రైసినా డైలాగ్-2026’ సదస్సులో “సాంకేతికత- సుపరిపాలన- భవిష్యత్తు” అనే అంశంపై సీఎం చంద్రబాబు కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఏపీలో అమలు చేస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్, డేటా ఆధారిత నిర్ణయాల ద్వారా పౌర సేవలను ఏ విధంగా మెరుగుపరచవచ్చో అంతర్జాతీయ వేదికపై ఆయన వివరించనున్నారు. సాంకేతికతను సామాన్యుడి దరికి చేర్చడంలో ఏపీ అనుసరిస్తున్న వినూత్న విధానాలను.. ప్రపంచ దేశాల ప్రతినిధులకు చంద్రబాబు పరిచయం చేయనున్నారు.
7 మార్చి, 2026 02:28 PMకి